Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోమ్: తమ సంకీర్ణ కూటమి భాగస్వామ్య పక్షాలు లీగ్, ఫైవ్స్టార్ మూవ్మెంట్ మధ్య కలహాలు ఇంకా కొనసాగితే తాను ప్రధాని పదవి నుండి వైదొలగుతానని ప్రధాని గిసిప్ కాంటె ప్రకటించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ రెండు పక్షాలూ సంకీర్ణ కూటమి బాధ్యతలను గౌరవిస్తున్నట్లయితే వారు తమ తరపున మంత్రివర్గ సభ్యుల పేర్లను అందించాలని తాను కోరుతున్నట్లు చెప్పారు. ఇరుపక్షాల విభేదాలు ఇకపై కూడా కొనసాగితే తాను ప్రజల తీర్పునకు తెరదించి పదవి నుండి వైదొలగుతానని స్పష్టం చేశారు. ఇటీవలి ఐరోపా పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.