Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శాన్ఫ్రాన్సిస్కో: దేశంలోని టెక్నాలజీ సంస్థల పెత్తందారీ విధానాలపై సమగ్ర విచారణ చేపట్టేందుకు అమెరికన్ కాంగ్రెస్ సోమవారం నాడు హౌస్ జుడిషియరీ కమిటీని ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. దేశంలో టెక్నాలజీ సంస్థలమధ్య పోటీ తత్వానికి విఘాతం కలిగిస్తూ పెత్తందారీ విధా నాలను అనుసరిస్తున్న కొన్ని బడా టెక్నాలజీ సంస్థలపై సమగ్ర సమీక్ష జరిపేందుకు ఈ కమిటీని ఏర్పాటుచేస్తున్నట్టు కాంగ్రెస్ ఒక ప్రకటనలో వివరించింది. అమెరికన్ కాంగ్రెస్ చరిత్రలో ఇటు వంటి విచారణ కమిటీ ఏర్పాటు కావటం ఇదే తొలిసారి. ఈ ప్రకటన విడుదల కావటానికి ముం దు ఫెడరల్ ప్రభుత్వం పెత్తందారీ నిరోధక విధానాలపై విచారణకు సిద్ధమవుతోందన్న వార్తలతో ఫేస్బుక్, గూగుల్, అమేజాన్, యాపిల్ వంటి టెక్ దిగ్గజ సంస్థలకు చెందిన షేర్లు పడిపోయాయి. ఈ విచారణ బాధ్యతలను నిర్వహించాల్సిన ఫెడరల్ న్యాయశాఖ, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ను పక్కన పెట్టి కాంగ్రెస్ రంగంలోకి దిగటం గమనార్హం. వాస్తవానికి ఫెడరల్ ట్రేడ్ కమిషన్కు పెత్తందారీ విధానాలపై చర్యలు తీసుకునే అధికారం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ అధికారాల ప్రకారం న్యాయశాఖ గూగుల్, యాపిల్ కంపెనీల పైన, ఎఫ్టిసి ఫేస్బుక్, అమెజాన్ సంస్థలపైన దర్యాప్తు కొనసాగించాల్సి ఉంది. ఈ అధికారాల విషయంలో గత వారం వెలువడిన వార్తలతో మదుపర్లు కొంత అనిశ్చితిని ఎదుర్కొంటున్నటు తెలుస్తోంది. బడా సంస్థలపై ఫెడరల్ ప్రభుత్వం ఎటువంటి విచారణలు ప్రారంభించినా అవి ఏళ్లూ పూళ్లూ పట్టే అవకాశం వుంటుందని పరిశీలకులు చెబుతున్నారు.
ఇప్పుడు ఫెడరల్ వ్యవస్థలు కాకుండా నేరుగా కాంగ్రెసే రంగంలోకి దిగటంతో ఈ కంపెనీల వ్యవహారాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోం దన్న విషయం అర్ధమవు తోందని ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ మాజీ ఛైర్మన్ బ్లెయిర్ లెవిన్ చెబుతున్నారు. అయితే విచారణ ఫలితాలు భిన్న రూపాల్లో వుండవచ్చని, ఈ కంపెనీల నియంత్రణకు చట్టాలు వచ్చే అవకాశాలు న్నాయని ఆయన వివరించారు. గత కొంతకాలంగా ఈ టెక్ సంస్థలు అనుసరిస్తున్న పెత్తందారీ విధానాలను పరిశీలించి కళ్లెం వేయాలన్న డిమాండ్ తో వినియోగదారులు, రాజకీయ నేతల నుండి ప్రభుత్వంపై వత్తిడి పెరుగుతున్న విషయం తెలిసిందే.