Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కైరో : ఓవైపు రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రార్థనలు జరుగుతోన్న సమయంలో మరోవైపు ఈజిప్ట్లో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. సినాయీ ద్వీపకల్పంలోని ఓ చెక్ పాయింట్ వద్ద బుధవారం ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు. ఈ దాడిలో 10 మంది పోలీసులు మృతి చెందారని వారు వివరించారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు అధికారులు, ఎనిమిది మంది సాధారణ పోలీసులు ఉన్నట్టు వారు నిర్ధరించారు. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్టు ఇప్పటివరకు ఏ ఉగ్ర సంస్థ ప్రకటించలేదు దాడి అనంతరం చెక్ పాయింట్ వద్ద ఆయుధాలు ఉన్న ఓ వాహనాన్ని తీసుకొని ఉగ్రవాదులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు.. ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయని అధికారులు తెలిపారు.