Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయోగించిన చైనా
బీజింగ్: సముద్ర ఉపరి తలం నుంచి తొలి రాకెట్ ప్రయోగాన్ని చైనా విజయవం తంగా ప్రయోగిం చింది. బుధవారం పచ్చ సముద్ర ప్రాంతం లోని ఒక కార్గోనౌక నుండి లాంగ్ మార్చ్ 11 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. ఈ ఉపగ్రహ ప్రయోగ వాహకనౌక ద్వారా ఐదు వ్యాపారపరమైన ఉపగ్రహాలను, శాస్త్ర పరిశోధనలకు సంబం ధించిన రెండు ఉపగ్రహాలను భూమి కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ రెండు ఉపగ్రహాలూ సముద్ర గమనాన్ని, గాలుల వేగాన్ని పరిశీలిస్తూ తుపాన్ల వంటి ప్రకృతి విపత్తులను అంచనా వేస్తుంటాయి. 380 కిలోల బరువు మోయగల సామర్ధ్యం కలిగిన ఈ ప్రయోగ వాహకనౌక 20.8 మీటర్ల పొడవుతో 58 టన్నుల బరువుతో నింగిలోకి ఎగిరింది. తొలిసారిగా 2015లో రోదసీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ రాకెట్ ద్వారా చైనా ఇప్పటికి ఐదుసార్లు తన ఉపగ్రహాలను గగనతలంలోకి పంపింది.