Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారికి శుభ్రత తెలియదని అవహేళన
లండన్: 'భారత్, చైనా, రష్యా వంటి దేశాలకు కాలుష్యం, శుభ్రత పట్ల కొంచెం కూడా అవగాహన ఉండదు. ఆ దేశాల్లో స్వచ్ఛమైన గాలి, నీరు అసలే ఉండవు. ఆ దేశాల్లో పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటాయి. భారత్, చైనా దేశాల్లో కొన్ని నగరాలు దారుణంగా ఉంటాయి. మీరు అక్కడికి వెళ్లినట్టైతే అర్ధమవుతుంది. అక్కడి గాలి కూడా పీల్చుకోవాలనిపించదు' అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆసియా దేశాల గురించి హేళనగా మాట్లాడారు. తమ దేశంలాగా మరే దేశమూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడటం లేదని ఆరోపించారు. తన మూడు రోజుల బ్రిటన్ పర్యటనలో భాగంగా ట్రంప్ బుధవారం బ్రిటన్ రాజు ప్రిన్స్ చార్లెస్ను కలిశారు. ఈ క్రమంలో పర్యావరణం, వాతావరణ మార్పు తదితర అంశాలపై ఆయనతో చర్చలు జరిపారు. అనంతరం ఆయన ఓ బ్రిటీష్ చానల్తో మాట్లాడారు. మొదట చార్లెస్తో 15 నిమిషాల పాటే సమావేశంలో పాల్గొనాలని అనుకున్నానని, కానీ పర్యావరణంపై ఆయనకున్న అవగాహన, ప్రకృతి గురించి ఆయన చెప్పిన మాటలు తనను ఆకర్షించాయని అందువల్ల సమావేశం గంటన్నరసేపు కొనసాగించానని తెలిపారు.
ప్రపంచంలోని దేశాలన్నింటితో పోలిస్తే పర్యావరణ పరిరక్షణలో అమెరికా ముందుంటుందని చెప్పారు. కాగా పర్యావరణ హితం కోసం అనుసరించాల్సిన విధానాలపై ప్రపంచ దేశాలు కుదుర్చుకున్న పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన సంగతి తెలిసిందే.