Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సెయింట్ పీటర్స్బర్గ్: తమ ప్రభుత్వం దేశంలో ఆర్థిక వాతావరణాన్ని మెరుగుపర్చి వ్యూహాత్మక జాతీయ ప్రాజెక్టులు అమలు చేస్తుండటంతో ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధి దిశగా పయనిస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. గురువారం ఇక్కడ ప్రారంభమైన సెయింట్ పీటర్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం 23వ వార్షిక సదస్సులో ఆయన ప్రారంభోపన్యాసం చేస్తూ ప్రగతి పథంలో తమకు ఎటువంటి అవరోధాలు ఎదురవలేదని, తాము స్థిరమైన వృద్ధి దిశగా ముందడుగు వేస్తున్నామని వెల్లడించారు.
రష్యన్ ఆర్థిక వ్యవస్థ మరింత ప్రగతి సాధించటానికి ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసారన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ కొన్ని సంక్లిష్ట పరిస్థితులను, ముఖ్యంగా తమ దేశంపై విధించిన ఆర్థిక ఆంక్షలను అధిగమించేందుకు తాము అనేక ఆర్థిక విధానాలు అమలులోకి తెచ్చామని ఆయన చెప్పారు. ఈ ఏడాది వార్షిక ద్రవ్యోల్బణం 5 శాతాన్ని అధిగమించిందని, ఇందుకు ప్రధానంగా తాము విలువ ఆధారిత పన్ను పెంచటమేనని పుతిన్ వివరించారు. దీనికి తోడు గత ఏడాది గణనీయమైన వాణిజ్య మిగులు సాధించామని, రష్యన్ మార్కెట్కు పెట్టుబడులు తిరిగి రావటం ప్రారంభమైందని చెప్పారు. 2019-24 మధ్య కాలంలో జాతీయ వ్యూహాత్మక అభివృద్ధి కోసం రూపొందించిన వివిధ రంగాలకు చెందిన ప్రాజెక్టులకు ఈ ఏడాది దాదాపు 25.7 లక్షల కోట్ల రూబుళ్లను వ్యయం చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తమ ప్రధాన లక్ష్యం ఆర్థిక వ్యవస్థను వికేంద్రీకరించటమేనని అన్నారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు ఆర్థిక వ్యవస్థ నిర్వహణను మెరుగు పర్చి డిజిటలైజ్ చేసేందుకు చర్యలు చేపట్టామని, ఈ ప్రక్రియలో వివిధ రంగాలలో క త్రిమ మేధో వినియోగాన్ని ప్రవేశపెట్టామని ఆయన చెప్పారు.
ఇదే సమయంలో దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించటంలో తమ ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు.