Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణాఫ్రికాలో రెడ్ అలర్ట్
కేప్టౌన్: దక్షిణాఫ్రికాలోని మైనింగ్ కమ్యూనిటి సరిహద్దు ప్రాంతంలో ఉన్న క్రుంగర్ నేషనల్ పార్క్ నుంచి 14 సింహాలు శుక్రవారం తప్పించుకున్నాయి. దీంతో అక్కడి అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతం లింపొఫో ప్రావిన్స్ పరిధిలో ఉండటం తో అక్కడి అటవీ అధికారులు రేంజర్లను రంగంలోకి దింపారు. మైనింగ్లో పనిచేసే ఉద్యోగులను, స్థాని కులను, అక్కడి వచ్చే పర్యాటకులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటివరకు సింహాలు ఎంత దూరం వెళ్లాయన్న సమాచారం లేదని పార్క్ అధికార ప్రతినిధి తెలిపారు. కాగా, కొద్ది రోజుల క్రిత ఇదే పార్క్లో ఓ చిరుత రెండేండ్ల బాలు డిపై దాడి చేసి చంపేయగా, ఇలాంటివి పునరావృతం కాకుండా అటవీ అధికారులు రెండు చిరుతలను కాల్చి చంపేశారు.