Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బుఖారెస్ట్: ఎన్నికలు జరిగిన మూడు నెలల తర్వాత మాల్డోవా రాజకీయ పార్టీలు దేశంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి24న మాల్డోవా పార్లమెంటరీ ఎన్నికలు ముగిసిన తరువాత తలెత్తిన రాజకీయ అనిశ్చితితో ప్రభుత్వ ఏర్పాటుకు మూడు నెలల గడువు విధిస్తూ పార్లమెంట్ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ ఎన్నికల్లో రష్యా అనుకూల వాదులైన సోషలిస్టులకు మెజార్టీ స్థానాలు లభించగా పాలక డెమోక్రాటిక్ పార్టీ రెండో స్థానంలోనూ ప్రతిపక్ష ఏసీయూఎం కూటమి మూడో స్థానంలోనూ నిలవటంతో హంగ్ పార్లమెంట్ ఏర్పడింది. దీంతో, ప్రధాన పక్షాలు పార్లమెంట్లో మెజార్టీ కూటమిగా ఏర్పడటంలో విఫలమవటంతో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. ఇప్పుడు అందరినీ ఆశ్చర్య పరుస్తూ కొత్త సంకీర్ణ కూటమికి సద్ధం కావటంతో మాజీ విద్యామంత్రి మలయి సందు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది.