Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టెహ్రాన్ : ఇస్లాం మత సంప్రదాయాలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న 547 రెస్టారెంట్లను మూసివేసినట్టు పోలీస్ చీఫ్ హుస్సేన్ రహీమీ ఆదివారం వెల్లడించారు. 11 మంది రెస్టారెంట్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించేలా రెస్టారెంట్లలో పాటలు వినిపించడం, ఇస్లాం సంప్రదాయానికి విరుద్ధంగా సైబర్స్పేస్పై ప్రకటనలు జారీ చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడిన రెస్టారెంట్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నామని రహీమీ తెలిపారు. నిందితులను కోర్టులో ప్రవేశపెడతామని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఇస్లాం మతాన్ని కించపరిచే విధంగా కామెంట్లు పెట్టినవారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.