Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్షుడి రాజీనామాకు డిమాండ్
పోర్టౌప్రిన్స్ : హైతీలో ఆందోళనలు మిన్నంటాయి. అధ్యక్షుడు జోవెనెల్ మోయిస్ రాజీనామా చేయాలనే డిమాండ్తో నిరసనకారులు కదం తొక్కారు. పోర్టౌప్రిన్స్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మోయిస్ని విమర్శిస్తూ నినాదాలు చేశారు. ప్లకార్డులు, బ్యానర్లు చేబూని నిరసన తెలిపారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడిన మోయిస్కు అధ్యక్ష పీఠంపై కూర్చునే అర్హత లేదంటూ నిరసనకారులు గళమెత్తారు. అధ్యక్ష భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. పోలీస్ హెడ్క్వార్టర్స్ ముందు టైర్లు, వాహనాలను దగ్ధం చేశారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడి ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన మోయిస్ తక్షణమే అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఆయన ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, మోయిస్ 2017లో హైతీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.రోడ్ల నిర్మాణం కోసం ఆయన అప్పగించిన రెండు కాంట్రాక్టు సంస్థలు బినామీ వ్యక్తులు నిర్వర్తిస్తున్నారు. 700,000 డాలర్ల ( రూ.4కోట్ల 84లక్షలు )మేర మోయిస్ అవినీతికి పాల్పడినట్టు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.