Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ అభ్యర్థనపై స్పందించిన ఇమ్రాన్ సర్కార్
న్యూఢిల్లీ : పాకిస్థాన్ గగన తలంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణించనున్న విమా నానికి అనుమతి ఇవ్వాలని ఇమ్రాన్ సర్కాన్ను భారత్ కోరింది. ఈనెల13,14 తేదీల్లో కిర్గిస్థాన్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సుకు మోడీ హాజరు కానున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా మోడీ ప్రయాణించే విమానానికి ఎయిర్స్పేస్ ఇవ్వాలని పాకిస్థాన్ను భారత్ కోరింది. ఈ సదస్సులో పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ కూడా పాల్గొంటారు. కాగా, ఫిబ్రవరి14న జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ఆత్మాహుతి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా, 35 మంది గాయపడ్డారు.
ఈ దాడికి ప్రతీకారంగా భారత వాయుసేన ఫిబ్రవరి26న బాలాకోట్లోని జైషే మహ్మద్ ఉగ్రశిబిరంపై వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటన అనంతరం భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటన అనంతరం పాకిస్థాన్ భద్రత మరింత కట్టుదిట్టం చేసింది. పాకిస్థాన్ దక్షిణ ప్రాంతం నుంచి మాత్రమే రెండు వాయు మార్గాలను తెరిచింది. విదేశీ విమానాలపై నిఘా పెంచింది.