Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్కు ట్రంప్ డిమాండ్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికాలో ఉత్పత్తి అయి భారత్కు ఎగుమతి అయిన మోటార్ సైకిళ్లపై 100శాతం సుంకం నుంచి 50శాతం సుంకం తగ్గించినప్పటికీ అది కూడా చాలా ఎక్కువేనని ట్రంప్ విమర్శించారు. తన సారథ్యంలో ఉన్న అమెరికాను ఎవరూ మోసం చేయలేరని ట్రంప్ అన్నారు. అమెరికా ఉత్పత్తులు ముఖ్యంగా మోటార్ సైకిళ్ల దిగుమతులపై సుంకాలను పూర్తిగా తొలగించాలని ట్రంప్ భారత్ను డిమాండ్ చేశారు. అమెరికాను ఇతర దేశాలు దోచుకోటానికి తమ ప్రభుత్వం ఏ మాత్రం అనుమతించబోదని సీబీఎన్ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అమెరికాలో తయారవుతున్న హార్లీడేవిడ్సన్ మోటార్ సైకిళ్లను భారత్ అసలు ధరకే దిగుమతి చేసుకోవాలని, వాటిపై సుంకాలు విధించరాదని ఆయన డిమాండ్ చేశారు. అమెరికా భారత్కు హార్లీ డేవిడ్సన్ బైకులను ఎగుమతి చేస్తుండగా భారత్ 100శాతం సుంకం విధిస్తోందని అదే భారత్లో తయారయ్యే వాటికి మాత్రం సున్నా శాతం పన్ను ఉందని చెప్పారు.ట్రంప్ సర్కారు భారత్కు షరతులు విధిస్తుండటంతో ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు గత ఏడాది నుంచి గాడితప్పిన విషయం తెలిసిందే. దీనికి తోడు ఇరాన్, వెని జులా దేశాల నుంచి చమురు కొనుగోళ్లు నిలిపి వేయాలని ఒత్తిడి పెంచిన ట్రంప్ సర్కారు రష్యా నుంచి కొనుగోలు చేయ తలపెట్టిన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కొనుగోళ్లను కూడా నిలిపివేయాలని శాసిస్తోంది. అయితే ఇందుకు ప్రతిస్పందింస్తున్న భారత్ తమ ఆర్థికాభి వృద్ధిలోనూ, జాతీయ భద్రత విషయంలోనూ ఏ మాత్రం రాజీ పడబోమని పలుమార్లు స్పష్టం చేసింది. అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీ సుంకాలు విధిస్తోందని ఈఏడాది ఫిబ్రవరిలో ట్రంప్ విమర్శించిన సంగతి తెలిసిందే. విదేశీ వస్తువులపై అధిక పన్నులు వసూలు చేసే జాబితాలో భారత్ కూడా చేరిందని అన్నారు.
దిగజారుతున్న ట్రంప్ దౌత్యం...
వాణిజ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు అమెరికా హద్దులు మీరుతోందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఈ నెలలో ఒసాకాలో జరుగనున్న జీ-20 సభ్యదేశాల సదస్సుకు హాజరు కాకుంటే చైనా ఉత్పత్తులపై టారిఫ్లను మరింత పెంచుతామన్న బెదిరింపులతో ట్రంప్ దౌత్యం నానాటికీ దిగజారుతోందని పరిశీకులు విశ్లేషిస్తున్నారు. ట్రంప్ సోమవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. చైనా తమ దేశంతో వాణిజ్య ఒప్పందానికి అంగీకరి స్తుందని, అంగీకరించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. గత కొద్ది నెలలుగా అమెరికా,చైనా దేశాలు వాణిజ్య చర్చలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ బెదిరింపు వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. నానాటికీ దిగజారుతున్న అమెరికన్ దౌత్యానికి ఇది నిదర్శనమని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైనా అమెరికా స్టడీస్లో సీనియర్ పాలసీ స్పెషలిస్ట్ సౌరభ్ గుప్తా వ్యాఖ్యానించారు.