Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సియోల్ : ఉభయ కొరియా దేశాలను వేరు చేస్తున్న సైనికరహిత ప్రాంతాన్ని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ సందర్శిం చనున్నారు.ఈ విషయాన్ని దక్షిణకొరియా విదేశాంగ శాఖ బుధవారం వెల్లడించింది. ఉత్తర,దక్షిణ కొరియా దేశాలను వేరుచేస్తున్న పన్మున్ జోమ్ ప్రాంతంలో యో జోంగ్ పర్యటిస్తారని ఓ ప్రకటనలో తెలిపింది. దక్షిణకొరియా తొలి మహిళా చీఫ్ లీహీ హౌ సోమవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి యో జోంగ్ నివాళి అర్పిస్తారని తెలిపింది. అనంతరం తమ ప్రతినిధులతో ఆమె సమావేశమ వుతారని దక్షిణకొరియా పేర్కొంది. కాగా, ఉభయ కొరియా దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు లీహీహౌ చాలా కష్టపడ్డారు. 1950-53 మధ్య కాలంలో కొరియా యుద్ధం సంభవించిన తర్వాత ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఈనేపథ్యంలో దక్షిణకొరియాకు సంబంధిం చిన నెతలెవరూ ఉత్తరకొరియాలో పర్యటించలేదు. అయితే, 2000 సంవత్సరంలో లీహీ హౌ తొలిసారిగా ఉత్తరకొరియాలో పర్యటించి కిమ్ని కలిశారు. అనంతరం మరో రెండు సార్లు ఉత్తరకొరియా నేతతో భేటీ అయి ఇరుదేశాల మధ్య శాంతిస్థాపన అంశంపై చర్చించారు. లీహీ హౌ దౌత్యం గతేడాది ఫలించింది. ఇరుదేశాల మధ్య ప్రస్తుతం సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. కాగా, కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపన లక్ష్యంతో గతేడాది సింగపూర్ నగరంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కిమ్ భేటీ అయ్యారు. ఈ భేటీ చరిత్రాత్మక భేటీగా నిలిచిపోయింది. ఉత్తర కొరియాపై మోపిన ఆంక్షలను తొలగించేందుకు అమెరికా అంగీకరించకపోవడంతో ఇరుదేశాధినేతల తొలి భేటీ ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వలేదు. ట్రంప్, కిమ్ మధ్య రెండో దఫా చర్చలు వియత్నాంలో జరిగాయి. ఉత్తరకొరియాపై ఆంక్షల అంశంపై ట్రంప్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఈ భేటీ కూడా సఫలం కాలేదు. అణు నిరాయుధీకరణ కార్యక్రమాల నుంచి ఉత్తర కొరియా తప్పుకున్నప్పటికీ కూడా ఆ దేశంపై ఆంక్షలను తొలగిం చేందుకు అమెరికా నిరాకరిం చడంతో ద్వైపాక్షిక సంబంధాలు బెడిసికొట్టాయి. కిమ్తో మూడోసారి సమావేశం అయ్యేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నప్పటికీ కిమ్ నుంచి సరైన స్పందన లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్తరకొరియాపై ఆంక్షలను పూర్తిగా తొలగించినట్టయితే ట్రంప్తో భేటీ అయ్యేందుకు తాను సిద్ధమంటూ కిమ్ గతనెలలో ప్రకటించారు.