Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: ప్రముఖ వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరస్థుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోడీకి కష్టాలు తప్పడం లేదు. ఆయన బెయిల్ పిటిషన్ను బ్రిటన్ హైకోర్టు తిరస్కరించింది. ఆయన బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికావడం ఇది వరుసగా నాల్గోసారి. బెయిల్పై బయటకొస్తే నీరవ్ మోడీ సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారని కోర్టు బలంగా నమ్మడంతో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. నీరవ్ మోడీ ఆయన తరపున వ్యక్తులు, సాక్షులను ప్రభావితం చేస్తారని ఇందుకు రుజువులు కూడా ఉన్నందున నీరవ్ మోడీకి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నామని న్యాయమూర్తి చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో కొన్ని వేల కోట్లు రుణం తీసుకుని ఎగవేతకు పాల్పడి లండన్కు పారిపోయాడు. ఇక లండన్ నుంచి భారత్కు రప్పించేందుకు చట్టపరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భారత అధికారులు నీరవ్ మోడీని అదుపులోకి తీసుకోవాల్సిందిగా అక్కడి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో లండన్ పోలీసులు నీరవ్ మోడీని అరెస్టు చేశారు.
నీరవ్ మోడీ అరెస్టు అయినప్పటి నుంచి ఆయన లాయర్లు వెస్ట్మినిస్టర్ కోర్టులో మూడు సార్లు బెయిల్ కోసం దాఖలు చేశారు. అయితే మూడుసార్లు ఆయనకు చేదు అనుభవమే ఎదురైంది. తాజాగా వెస్ట్మినిస్టర్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ యూకే హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ కూడా అదే ఫలితం వచ్చింది. భారత ప్రభుత్వం చెబుతున్నట్టుగా తన క్లయింట్ నీరవ్ మోడీ దేశం విడిచి వెళ్లరని హైకోర్టులో వాదించినప్పటికీ కోర్టు విశ్వసించలేదు. నీరవ్ మోడీ లాయర్లు. తాను దేశం దాటి పారిపోతారని చెప్పేందుకు బలమైన ఆధారాలు భారత ప్రభుత్వం చూపించలేకపోతోందని లాయర్ జడ్జిముందు తన వాదనలు వినిపించారు.