Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: అక్టోబర్ 31 నాడు బ్రెగ్జిట్ అమలు చేస్తానని ప్రతిజ్ఞ చేసిన బోరిస్ జాన్సన్ అధికారానికి అత్యంత సమీపంలో ఉన్నారు. గురువారం నాడు ప్రధానమంత్రి థెరెసా మే స్థానాన్ని చేపట్టేందుకు జరిగిన మొదటి రౌండ్లో కన్జర్వేటివ్ పార్టీ చట్టసభ్యులు అధిక సంఖ్యాకులు బోరిస్ జాన్సన్కు మద్దతు తెలపడంతో ఆయన భారీ ఆధిక్యతతో గెలుపొందారు. జాన్సన్ కు 114 ఓట్లు రాగా విదేశాంగ కార్యదర్శి జెరెమీ హంట్ 43 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. పర్యావరణ మంత్రి మైకెల్ గోవె 37 ఓట్లతో మూడో స్థానం పొందారు. మిగతా ముగ్గురు అభ్యర్థులు-ఆండ్రియా లీడ్సమ్, ఎస్తేర్ మెక్వే, మార్క్ హార్పర్ అవసరమైన కనీస 17 ఓట్లు పొందడంలో విఫలం కావడంతో పోటీ నుంచి వైదొలగాల్సి వచ్చింది.