Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సురక్షితంగా బయటపడ్డ సాంకేతిక సిబ్బంది
- పేలుళ్ళకు ఇరానే కారణమన్న అమెరికా
- అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలు
దుబాయ్: ఒమెన్లో రెండు చమురు చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల్లో వాటిలోని సాంకేతిక సిబ్బంది సురక్షితంగా బయట పడ్డారు. ఈ సంఘటనతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి. అమెరికా-ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో జరిగిన ఈ దాడులు జరగడం గమనార్హం. ఈ దాడులకు ఇరానే కారణమని అమెరికా ఆరోపిస్తోంది. తమ తీర ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో రెండు టాంకర్లు పేలిపోవడంతో అందులోని 44 మంది సాంకేతిక సిబ్బందిని తమ నావికాదళం రక్షించిందని ఇరాన్ తెలిపింది. ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించిన సమాచారం మేరకు దక్షిణ ఇరాన్లోని బండర్ ఇ జాస్క్లో 25 నాటికల్ మైళ్ళ దూరంలో ఉదయం 8.50 నిముషాలకు ఫ్రంట్ ఆల్టైర్పై మొదటి దాడి జరిగింది. మార్షల్ ఐలండ్ జాతీయ జెండాలతో ఉన్న ఈ ట్యాంకర్ ఖతార్ నుంచి తైవాన్కు ఎథనాల్ను తీసుకెళ్తోంది. ఈ నౌక మంటల్లో చిక్కుకోగానే దానిలోఉన్న 23 మంది సాంకేతిక సిబ్బంది నీటిలోకి దూకడంతో అటు పక్కగా వెళ్తున్న మరో నౌక వారిని కాపాడి ఇరాన్ రెస్క్యూ సిబ్బందికి అప్పగించినట్టు ఆ వార్తా సంస్ధ వెల్లడించింది. రెండో సంఘటన ఉదయం 9.50 నిముషాలకు 28 నాటికల్ మైళ్ళ దూరంలో జరిగింది. పనామా జాతీయ జెండాలతో వున్న రెండో నౌక మెథనాల్తో సింగపూర్ నుండి సౌదీ అరేబియాకు వెళ్తున్నది. ఇందులో 21 మంది సిబ్బంది కూడా నీటిలోకి దూకడంతో అటుగా వెళ్తున్న నౌక వారిని రక్షించింది. ఈ సంఘటనలపై మరింత దర్యాప్తు చేసేందుకు సిబ్బందిని రంగంలోకి దింపినట్టు ఇరాన్ తెలిపింది.