Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెన్షన్లో కార్మిక వ్యతిరేక సంస్కరణలపై ఆగ్రహం
- నేడు 24 గంటల పాటు నిరసనలు
బ్రెజిల్: పదవీ విరమణ వయస్సు పెంచుతూ, పెన్షన్ పథకాలలో కార్మిక వ్యతిరేక సంస్కరణలు తీసుకువస్తున్న బ్రెజిల్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరే కంగా ఆ దేశ ప్రజలు పెద్ద ఎత్తున శుక్రవారం 24 గంటల పాటు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నిరసనలో వేలాది మంది పౌరులు, కార్మిక సంఘాలు పాల్గొననున్నాయనీ సమాచారం. బస్సు డ్రైవర్లు, పెట్రో లియం రంగానికి చెందిన కార్మికులు, విద్యుత్రంగ కార్మికులు, వివిధ కార్మిక సంఘాలు పాల్గొననున్నారు. కార్మిక సంఘాలే కాకుండా విద్యార్థులు కూడా ఈ సమ్మెలో పాల్గొననుండటం గమ నార్హం. కొత్త తీసుకురానున్న సంస్కర ణల ద్వారా కార్మికులకు నష్టం వాటిల్ల నుందని కార్మికులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న పెన్షన్ నిబంధనల ప్రకారం.. ఉద్యోగ విరమణ వయస్సు సగటు 55 ఏండ్లు . ఉద్యోగంలో 30 ఏండ్లు కొనసాగిన అనంతరం, ఉద్యోగ విరమణ ఎప్పుడైనా చేయవచ్చు. వారందరికీ పెన్షన్ లభిస్తుంది. అయితే కొత్తగా తీసుకురానున్న పెన్షన్ నిబంధనల ప్రకారం ఉద్యోగ విరమణ వయస్సు పురుషులకు 65, మహి ళలకు 62 ఏండ్లుగా పెంచనున్నారు. అలాగే ఉద్యోగంలో 35 ఏండ్ల పాటు కోనసాగిన వారికి మాత్రమే పెన్షన్ లభించేలా బ్రెజిల్ ప్రభుత్వం సంస్క రణలు తీసుకొచ్చింది. కేవలం పెన్షన్ సంస్కరణలే కాకుండా కార్మిక చట్టాల్లో తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక సంస్కర ణలకు వ్యతిరేకంగా వివిధ డిమాండ్ లతో ప్రభుత్వానికి విన్నవిస్తూ యూనై టెడ్ ఫెడరేషన్ ఆఫ్ వర్కర్స్ యూనియన్ సమ్మెకు పిలుపు నిచ్చింది. బ్రెజిల్ ప్రధాని జైర్ బల్సానారో నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే అనేక పెట్రోలియం రిఫైనరీ సంస్థలను ప్రైవేట్ పరం చేసింది. దీనికి సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందనీ ఫెడరేషన్ డైరెక్టర్ అలెగ్జాండ్రే ఫినామోరి చెప్పారు. ఈ దీని వల్ల కార్మికులకు పెద్ద మొత్తంలో నష్టం జరుగుతున్నదనీ తెలిపారు. విద్యారంగానికి సంబంధించి బడ్జెట్క ోతకు వ్యతిరేకంగా బ్రెజిల్లోని ప్రధాన విశ్వవిద్యాలయాలు, విద్యార్థి సం ఘాలు, సామాజిక కార్యకర్తలు నిరసనల్లో పాల్గొననున్నట్టు తెలు స్తోంది. సమ్మెలో విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు సైతం పాల్గొననున్నారు.