Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాక్ విదేశాంగ మంత్రి ఆరోపణ
ఇస్లామాబాద్: మైత్రి కోసం తాము ప్రయత్నిస్తున్నప్పటికీ భారత్ సహకరించట్లేదని పాకిస్థాన్ ఆరోపిం చింది. భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దుకు నేందుకు చర్చలకు రావాల్సిందిగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, విదేశాంగ మంత్రి ఖురేషీ లేఖలు రాసిన విషయం తెలిసిందే. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరుగుతున్న షాంఘై కోపరేషన్ ఆర్గనేజషన్ ( ఎస్సీఓ) సమావేశాలకు ముందు నుంచి భారత్కు లేఖలు పంపించామని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి తెలిపారు. భారత్తో సత్సంబంధాలు నెరిపేందుకు చర్చలకు రావాల్సిందిగా ఇమ్రాన్, ఖురేషి వేర్వేరుగా లేఖలు రాశారు. అయితే, వీటిపై భారత్ స్పందించలేదు. దీంతో, ఖురేషి విమర్శలకు దిగారు. భారత ప్రధాని మోడీ ఎస్సీఓ సదస్సుకు వెళ్లడానికి పాక్ ఎయిర్స్పేస్ను అడిగినప్పుడు తాము అందుకు అంగీకరించామని, కాని మోడీ పాక్ ఎయిర్ స్పేస్ నుంచి కాకుండా వేరే మార్గంలో వెళ్లారని అన్నారు. ఎన్నిసార్లు లేఖలు రాసినా భారత్ నుంచి సమాధానం రాలేదని అన్నారు. తాము పొరుగుదేశాలతో పారదర్శకంగా మెలగాలనే ఉద్దేశ్యంతోనే చర్చలకు ఆహ్వానించామని, కాని భారత్ ఇలా చేస్తే, వారితో మైత్రి కోసం వెంపర్లాడేది లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం బిష్కెక్లో జరుగుతున్న ఎస్సీవో సదస్సు వేదికగా పాకిస్థాన్ తీరును మోడీ ఎండగట్టే ప్రయత్నం చేశారు. పాక్ ఇకనైనా ఉగ్రవాద రహిత దేశంగా మెలిగితే కనీసం కొందరైనా మైత్రి కొనసాగిస్తారని లేకపోతే దాయాది దేశం ఏకాకిగా మిగిలిపోవాల్సి వస్తుందని హితవు పలికారు.