Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గల్లంతైన 54మంది ప్రయాణికులు
- అన్వేషణకు ప్రతికూలంగా వాతావరణం
జకర్తా : ఆదివారం ఉదయం గల్లంతైన ఇండోనేషియా విమానం ఆచూకీ లభించింది. ఉత్తర పవువా ప్రాంతంలోని ఒక్తాబా జిల్లాలోని పర్వత శ్రేణుల్లో విమానం కుప్పకూలిపోయిందని స్థానికులు సమాచా రమందించారని త్రిగణ ఎయిర్ అధికారులు వెల్లడించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ ప్రదేశానికి బయలుదేరారు. అయితే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా విమాన ప్రమాద ప్రాంతానికి చేరుకోవటం ఆలస్యమవుతుందని అధికారులు తెలిపారు. పవువా రాజధాని జయపురి విమానాశ్రయం నుంచి 54మందితో కూడిన తిగణ ఎయిర్ ఏటీఆర్ 42 అనే ఇండోనేషియా విమానం 54 ప్రయాణికులతో ఒక్సిబిల్కు వెళ్తు గల్లంతైంది. జయపురి విమానాశ్రయం నుంచి స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ఆ విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్తో సంబంధాలను కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. త్రిగణ అనేది ఇండోనేషియా విమాన సంస్థ. ప్రయాణికుల్లో 44 మంది పెద్దలు, ఐదుగురు పిల్లలు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు.