Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11 మంది మృతి, 25 మందికి గాయాలు
మొగధీషు : వరుస బాంబు పేలుళ్లతో సోమాలియా దద్దరిల్లింది. రాజధాని మొగదీషులోని అధ్యక్ష భవనంతోపాటు మరో చోట సంభవించిన కారుబాంబు పేలుళ్లలో 11 మంది మృతి చెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొదటి ఘటన అధ్యక్ష భవనం సమీపంలోని తనిఖీ కేంద్రం వద్ద జరిగిందన్న అధికారులు.. ఎనిమిది మంది చనిపోయారని వెల్లడించారు. రెండో ఘటన ఫోర్ట్ఫీల్డ్ విమానాశ్రయం సమీపంలోని తనిఖీ కేంద్రం వద్ద సంభవించిందని తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్ సహా మరో వ్యక్తి మృతి చెందారు. బాంబు పేలుళ్లకు బాధ్యత వహిస్తున్నట్టు అల్ షాబాబ్ ఉగ్రసంస్థ ప్రకటించుకుంది. 2017 అక్టోబర్లో జరిగిన బాంబు పేలుళ్లకు అల్ షబాబ్ సంస్థే కారణం. ఈ ఘటనలో 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.