Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనా వెల్లడి
బీజింగ్: అరుదైన భూగర్భ ఖనిజాల (రేర్ ఎర్త్ మెటల్స్)వెలికి తీతకు సంబంధించి తాము నూతన విధానాన్ని రూపొందిస్తున్నామని చైనా ప్రభుత్వ ప్రణాళికా సంస్థ ఎన్ఆర్డీసీ ప్రకటించింది. దీనిని సాధ్యమైనంత త్వరలో వెల్లడిస్తామని ఎన్ఆర్డీసీి ప్రతినిధి మెంగ్ వీ సోమవారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. అమెరికాతో వాణిజ్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా రేర్ ఎర్త్ మెటల్స్ కొత్త విధానం దిశగా అడుగులు వేస్తుండటం విశేషం. చైనా నుండి జరిగే రేర్ఎర్త్ మెటల్స్ ఎగుమతుల్లో అమెరికా 80 శాతం మేర దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. తమ ఉత్పత్తులపై అమెరికా భారీయెత్తున దిగుమతి సుంకాలను పెంచటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చైనా ఈ రేర్ఎర్త్ మెటల్స్ ఎగుమతులపై పరిమితులు విధిస్తామని ఇప్పటికే ప్రకటించింది.
ఈ ఖనిజ లోహాలను ఎలక్ట్రిక్ కార్ మోటార్లు, ఎలక్ట్రానిక్స్, చమురు శుద్ధి ప్రక్రియల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఈ ఖనిజాలను ఆయుధ తయారీలో కూడా వినియోగిస్తుండటంతో అమెరికా జాతీయ భద్రతకు ఇవి కీలకం కావటం గమనార్హం. రేర్ఎర్త్ మెటల్స్ ఎగుమతులను చైనా కట్టడి చేస్తున్న నేపథ్యంలో ఆఫ్రికా దేశాల నుండి వీటిని దిగుమతి చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చైనా సరఫరా చేసినంత భారీ స్థాయిలో ఈ దేశాల వద్ద వనరులు లేవు. చైనాలో ప్రపంచంలోనే 30 శాతం మేర రేర్ఎర్త్ మెటల్స్ నిక్షేపాలు వున్నట్లు అధికారిక అంచనాలు పేర్కొంటున్నాయి.