Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిటిష్ ఆయిల్ ట్యాంకర్ను అడ్డగించలేదు : ఇరాన్
టెహ్రాన్: గల్ఫ్ సమీపంలోని హెర్ముజ్ జలసంధిలో ఇరాన్కు చెందిన మూడు నౌకలు బ్రిటిష్ ఆయిల్ ట్యాంకర్ 'హెచ్ఎమ్ఎస్ మన్ట్రోజ్'ను అడ్డుకునేందుకు ప్రయ త్నించాయని బ్రిటిష్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ప్రస్తు తం ఆ ప్రాంతంలో చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇరాన్కు సూచించింది. 'ఇరాన్ నౌకల మధ్య హెచ్ఎమ్ఎస్ మన్ట్రోజ్ బలవంతంగా తన దిశను మార్చుకుని వెళ్లాల్సి వచ్చింది. ఇరాన్ చర్యలు అంతర్జాతీయ చట్టాలకు విఘాతం కల్గించేలా ఉన్నాయి' అని బ్రిటిష్ రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు. అయితే, ఈ ఆరోపణలను ఇరాన్ విదేశాంగ మంత్రి మొహ్మద్ జవాద్ జరీఫ్ తోసిపుచ్చారు. బ్రిటన్ తమపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తోందని ఖండించారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) నౌకలు ఈ చర్యకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నానని అన్నారు. గల్ఫ్ నుంచి జలసంధి ద్వారా వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమను ఆ నౌకలు అడ్డగించిన నేపథ్యంలో 'హెచ్ఎమ్ఎస్ మన్ట్రోజ్' సిబ్బంది పలు హెచ్చరికలు జారీ చేయడంతో.. ఆ నౌకలు తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన ప్రాంతం వివాదాస్పద జలాలు ఉండే అము ముసాకి దగ్గరలో ఉంటుంది. ఆంక్షలను ఉల్లంఘిస్తూ సిరియాకు క్రూడాయిల్ను సరఫరా చేస్తున్న ఆరోపణలపై ఇటీవల ఇరాన్కు చెందిన గ్రేస్ 1 సూపర్ ట్యాంకర్ను యూకే స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతికారంగా తాము బ్రిటన్కు చెందిన నౌకను స్వాధీనం చేసుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు హస్సన్ రౌహాని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుందనే అనుమా నాలు తలెత్తాయి. అణు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్టు ఇరాన్ ఇటీవల ప్రకటించిన అనంతరం ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.