Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన భారత్-అమెరికా వాణిజ్య చర్చలు
- వాణిజ్యం యుద్ధం...కొనసాగిస్తున్న అమెరికా
న్యూఢిల్లీ : డొనాల్డ్ ట్రంప్ వాణిజ్యయుద్ధానికి తెరలేపిన నేపథ్యంలో, అమెరికా-భారత్ సంబంధాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. రెండు దేశాలూ కూడా దిగుమతులపై సుంకాలు పెంచడంతో ద్వైపాక్షిక సంబంధాలు సైతం దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. వాణిజ్య సంబంధాల్లో ఏర్పడ్డ సంక్షోభాన్ని పరిష్కరించుకోవటం కోసం అమెరికా-భారత్ మధ్య ఇటీవల న్యూఢిల్లీలో అధికారుల స్థాయి చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని వార్తలు వెలువడ్డాయి. ఇరుదేశాల ప్రతినిధులు ఏకాభిప్రాయానికి రాలేకపోయారనీ, ముఖ్య నిర్ణయాలేవీ తీసుకోలేదనీ చర్చల్లో పాల్గొన్న ఇద్దరు కేంద్ర ఉన్నతాధికారులు మీడియాకు తెలిపారు. ఈనేపథ్యంలో ఇరు దేశాల వాణిజ్యసంబంధాల్లో అనిశ్చిత పరిస్థితి మరింత పెరిగింది. ఈకామర్స్, ఉక్కు, అల్యూమినియం, వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో భారత్ ఎగుమతులు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ అంశంలో అమెరికాలోని వాణిజ్య ప్రతినిథులతో చర్చలు జరపడానికి భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ వాషింగ్టన్కు వెళ్లనున్నారని తెలిసింది. సుంకాల విధింపుపై ఇరుదేశాల చర్చల్లో సానుకూల ఫలితం లభించలేదనీ ఒక ఉన్నతాధికారి మీడియాకు తెలిపారు. మూడు గంటలకు పైగా ఇరుదేశాల ఉన్నతాధికారులు చర్చలు జరిపారనీ, అయితే ఇది కేంద్ర మంత్రి పియూష్ గోయల్ వాషింగ్టన్కు వెళ్లి తేల్చుకోవాల్సిన అంశమనీ వారు చెప్పారు.