Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిక్టర్స్కేల్పై తీవ్రత 7.3గా నమోదు
జకార్తా : ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. రిక్టర్స్కేల్పై తీవ్రత 7.3గా నమోదైందని యూఎస్ జియోలజికల్ సర్వే అధికారులు తెలిపారు. ప్రకంపనల కారణంగా భయబ్రాంతులకు గురైన ప్రజలు వీధుల్లోకి పరుగులు తీసారు. అయితే అధికారులు ఎటువంటి సునామీ హెచ్చరికలు విడుదల చేయలేదు. ఉత్తర మలుకు ప్రావిన్స్లోని టెర్నేట్ పట్టణంలో (స్థానిక కాలమానం ప్రకారం) సాయంత్రం 6.28 గంటలకు ఈ ప్రకంపనలు నమోదయినట్టు అధికారులు తెలిపారు. ప్రాణ, ఆస్తినష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. కాగా, గతేడాది ఇండోనేషియాలోని భూకంపం సంభవించింది. రిక్టర్స్కేల్పై దీని తీవ్రత 7.5గా నమోదైంది. ఈ ప్రకృతి విపత్తులో 2200 మంది మృతిచెందారు. వందలాది మంది గల్లంతయ్యారు.