Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢాకా : బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత హుస్సేన్ ముహమ్మద్ ఎర్షాద్ (89) మృతి చెందారు. ఇర్షాద్ గత కొంతకాలంగా కిడ్నీ, కాలేయం సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్టు ప్రెస్ సెక్రెటరీ సునీల్ షువారారు పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో 1982, ఏప్రిల్24న సైనిక తిరుగుబాటు చెలరేగినప్పుడు ఆర్మీ చీఫ్గా ఉన్న ఎర్షాద్ తనకు తాను ప్రెసిడెంట్గా ప్రకటించుకున్నారు. 1990 డిసెంబర్ వరకు దేశాధ్యక్షుడిగా కొనసాగారు. ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తంకావడంతో అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. అనేక అవినీతి ఆరోపణల్లో దోషిగా తేలడంతో ఎర్షాద్ జైలు పాలయ్యారు. జైలు నుంచి విడుదలైన అనంతరం కూడా రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు. 1985లో ఆయన స్థాపించిన బంగ్లాదేశ్ జాతీయ పార్టీకి నేటికీ ప్రజాధరణ ఉన్నది.