Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: ఆశ్రయం కోసం అమెరికాకు వచ్చిన వలసదారుల పట్ల ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న విధా నాలు వివాదాస్పదమ య్యాయి. సరైన ధ్రువీకరణ పత్రాలు లేవనే ఆరోప ణలపై వలస దారులను యూఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుంటున్నారు. అంతర్యుద్ధాల కారణంగా నిరాశ్రయులై ఆశ్రయం కోసం వచ్చిన వలసదారులను అధికారులు అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అమెరికా ఫస్ట్, ఇమ్మిగ్రేషన్ చట్టాలలో మార్పు, వలసదార్ల ఏరివేతే నినాదాలుగా అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్. అధికారంలోకి వచ్చి రాగానే ఈ దిశగా చర్యలు చేపట్టారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో సమూల మార్పులు చేపట్టారు. మరోవైపు వలసదారుల పట్ల ట్రంప్ సర్కార్ చర్యలు అమానవీయంగా ఉన్నాయంటూ డెమోక్రాట్లు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ట్రంప్ దూకుడు కారణంగా భయాందోళనలకు గురైన వలసదార్లు. ఏ క్షణాన ఏం జరుగుతోందోనన్న కారణం చేత మధ్య అమెరికా నుంచి పెద్దసంఖ్యలో యూఎస్ సరిహద్దులకు చేరుకుంటున్నారు. 2016లో బరాక్ ఒబామా హయాంలోనూ. ట్రంప్ అధికారంలోకి వచ్చాకా 2017లోనూ వలసదార్లపై ఇదే తరహా ఆపరేషన్ నిర్వహించారు.అప్పట్లో దాదాపు 2000 మందిని లక్ష్యంగా చేసుకుని సోదాలు నిర్వహించారు. మరోవైపు దీని ప్రభావం అమెరికాలో స్థిరపడిన భారతీయులపైనా పడే అవకాశం ఉందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తుండటంతో . వృత్తి, ఉద్యోగాల నిమిత్తం అమెరికాలో ఉంటున్న పలువురు భారతీయుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.