Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైన్యం కాల్పుల్లో పౌరుడి మృతిని నిరసిస్తూ ప్రదర్శనలు
ఖార్తౌమ్ : సుడాన్ రాజధాని ఖార్తౌమ్లో నిరసనకారులు కదం తొక్కారు. పారామిలిటరీ బలగాలు ఓ అమాయక పౌరుడిని అకారణంగా పొట్టనబెట్టుకున్నాయని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ప్లకార్డులు, బ్యానర్లు చేబూని ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుడాన్ జాతీయ పతాకాన్ని ప్రదర్శించి విప్లవ గీతాలు ఆలాపించారు. అనంతరం సిన్నార్ రాష్ట్రంలోని ఎల్సౌక్ పట్టణ వీధుల్లో భారీ ర్యాలీ తీశారు. ఈ నిరసన కార్యక్రమాలకు స్థానికులు, డాక్టర్లు సంఘీభావం తెలిపారు. ఎల్సౌక్ పట్టణంలోకి పారామిలిటరీ బలగాలు ప్రవేశించడాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిరసనకారులకు, పోలీసులకు, పారామిలిటరీ బలగాలకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. నిరసనకారులను చెదరగొట్టేందకు సైనికులు గాల్లో కాల్పులు జరిపారు. అనంతరం సైన్యం జరిపిన కాల్పులో ఓ పౌరుడు మృతి చెందాడు. మరొకొందరు గాయపడ్డారు.