Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని చైనా విమర్శ
బీజింగ్: ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్నందునే తమతో వాణిజ్య ఒప్పందానికి తొందరపడుతోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విమర్శలను చైనా తోసిపుచ్చింది. చైనా విదేశాంగ ప్రతినిధి గెంగ్ షువాంగ్ మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ వ్యాఖ్యలు ప్రజలను పూర్తిగా తప్పుదారి పట్టించే విధంగా వున్నాయన్నారు. వాణిజ్య ఒప్పందం ఇరుదేశాలకూ అవసరమేనని ఆయన గుర్తు చేశారు. ఈ ఏడాది ప్రథమార్థంలో చైనా ఆర్థిక వ్యవస్థ పురోగతి 'తీసికట్టుగా ఏమీ లేదని' స్పస్టం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిని ఎదుర్కొంటుండటం, ప్రపంచ ఆర్థికాభివ ద్ధి మందకొడిగా వుండటం వంటి పరిస్థితుల కారణంగానే తమ దేశంలో కూడా ఈ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. ప్రపంచంలో ప్రస్తుతం ఇటు చైనా, అటు అమెరికా ఆర్థిక వ్యవస్థలు స్థిరమైన వ ద్ధిరేటును నమోదు చేసుకుంటున్నాయన్నారు. ఆర్థిక మాంద్యం కారణంగానే చైనా తమతో వాణిజ్య ఒప్పందాకి తొందరపడుతోందంటూ అమెరికా చేస్తున్న వాదన పూర్తి తప్పుదారి పట్టించేదిగా వుందని ఆయన తేల్చిచెప్పారు. ఆర్థిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవటం పూర్తిగా ఏకపక్షం కాదని, ఇది ఇరుదేశాలకూ ప్రయోజనరమైనదేనని ఆయన అన్నారు. పరస్పర గౌరవం, విశ్వాసం ఆధారంగా పరస్పర ప్రయోజనకరంగా ఈ ఒప్పందం వుండాలని, అంతర్జాతీయ సమాజం ఆకాంక్షలకు, ఇరుదేశాల ప్రయోజనాలకు అనుగుణంగా వుండాలని తాము భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.