Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పాకిస్థాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు 5 నెలల తర్వాత పాకిస్థాన్ తన గగనతలంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది.. మంగళవారం అర్థరాత్రి నుంచి అన్ని రకాల ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ను పునరుద్ధరించనున్నట్టు విమాయాన సంస్థలకు పాకిస్థాన్ సివిల్ ఏవియోషన్ అధికారులు తెలిపారు. కాగా మొత్తం 140 రోజుల పాటు పాక్ గగనతలంపై విమానాల ప్రయాణాన్ని నిలిపివేసింది. దీంతో సుమారు రూ.500 కోట్లు విమానయాన సంస్థలకు నష్టం వాటిల్లినట్టు సమాచారం. ఈ ఏడాది పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో భారత వాయుసేన దీనికి ప్రతీకారంగా బాలాకోట్పై దాడులు చేసింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేస్తూ అసాధారణ నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్ నుంచి అమెరికా, యూరోప్ దేశాలకు రాకపోకలు సాగిస్తున్న అంతర్జాతీయ విమానాలు తమ మార్గాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. అనంతరం 5 నెలల తర్వాత తమ గగనతలాన్ని గతంలో ప్రచురించిన ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్ మార్గాల్లో మంగళవారం నుంచి అన్ని రకాల విమానాల రాకపోకలకు అనుమతిస్తున్నట్టు పాకిస్థాన్ పౌర విమానయాన సంస్థ ప్రకటించింది. దీంతో ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానాల రాకపోకలకు మార్గం సుగమమైంది. పాక్ తన గగనతలాన్ని మూసివేయడం వల్ల విమానయాన సంస్థలకు రూ.491 కోట్ల నష్టం వాటిల్లింది. పాక్ గగనతలం మూసివేతతో ఢిల్లీ నుంచి ఇస్తాంబుల్ కు రాకపోకలు సాగించే ఇండిగో విమాన సర్వీసును రద్దు చేశారున