Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కీటకనాశిని వల్ల క్యాన్సర్ సోకటంతో బాధితుడికి రూ.173కోట్లు నష్టపరిహారం
కాలిఫోర్నియా : మాన్శాంటో వర్సెస్ ఎడ్విన్ హార్డిమాన్(క్యాన్సర్ బాధితుడు) కేసులో అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బాధితుడు హార్డిమాన్ క్యాన్సర్ బారిన పడటానికి, జీవితంలో అతడు పొందిన మనోవేదనకు నష్టపరిహారంగా 25.27 మిలియన్ డాలర్లు(సుమారుగా రూ.173కోట్లు) చెల్లించాలని న్యాయస్థానం తీర్పు చెప్పింది. అమెరికా ఆగ్రోకెమికల్, విత్తన తయారీ సంస్థ 'మాన్శాంటో'కు వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది. అయితే బహుళజాతి సంస్థ మానోశాంటోను జర్మనీకి చెందిన మరో బహుళజాతి సంస్థ 'బాయర్ ఏజీ' ఏడాదిక్రితం కొనుగోలుచేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో బాధితుడికి నష్టపరిహారం బాయర్ కంపెనీయే చెల్లించాల్సి ఉంటుంది. ఈకేసులో న్యాయస్థానం విధిస్తున్న శిక్షకు 'మాన్శాంటో' పూర్తిగా అర్హమైనదని న్యాయమూర్తి విన్స్ ఛాంబ్రియా తీర్పు సందర్భంగా పేర్కొనటం గమనార్హం.