Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు
- గూఢచర్యం కేసులో మిలిటరీ కోర్టు తీర్పును పాక్ పున: సమీక్షించుకోవాలి : ఐసీజే
దిహేగ్: భారత నౌకాదళ విశ్రాంత అధికారి కుల్భూషణ్ జాదవ్ కేసులో పాక్పై భారత్ పైచేయి సాధించింది. జాదవ్కు పాకిస్థాన్ మిలిటరీ కోర్టు విధించిన ఉరిశిక్షను నిలిపిస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించిన తీర్పును పాకిస్థాన్ పున: సమీక్షించేంత వరకు మరణశిక్షను నిలిపివేస్తున్నట్టు న్యాయస్థానం వెల్లడించింది. ఐసీజేలోని
16 మంది న్యాయమూర్తుల్లో 15 మంది భారత్కు అనుకూలంగా రూలింగ్ ఇచ్చారు. జాదవ్ను విడుదల చేయాలన్న భారత్ అభ్యర్థనను ఐసీజే తిరస్కరించింది. జాదవ్ను భారత్కు అప్పగించాలనే వాదనలను తోసిపుచ్చింది.