Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నదియా మురాద్కు రావడం పట్ల ట్రంప్ పరిహాసం
వాషింగ్టన్ : నోబెల్ శాంతి బహు మతి గ్రహీత నదియా మురాద్కు అవమానం జరిగింది. ఆయన్ను అవమానపరిచే రీతిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడారు. ఇరాక్లో ఐఎస్ చేతుల్లో లైంగిక హింసకు గురవుతున్న ఎంతో మంది యాజిదీ యువతులకు నదియా విముక్తి కల్పించారు. ఒకప్పుడు లైంగిక బానిసగా ఉన్న ఆమె చేసిన ఈ కృషికి గానూ గతేడాది నోబెల్ శాంతి పురస్కారం అందుకున్నారు. కాగా బుధవారం ఆమె శ్వేతసౌధంలో ట్రంప్ను కలిశారు. ఇరాక్లోని యాజిదీలు అనుభవిస్తున్న నరకం, వారి దీనస్థితి గురించి ఆయనకు వివరించారు. ఐఎస్, కుర్దు తిరుగుబాటుదారుల చేతుల్లో బలైపోతున్న యాజిదీలకు విముక్తి కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో నదియా మాట్లాడుతున్న సమయంలో ట్రంప్ ఆమె మాటలకు అడ్డు తగిలారు. 'నీకు నోబెల్ బహుమతి వచ్చిందా? గొప్ప విషయం. అవును అసలు వాళ్లు నీకెందుకు అవార్డు ఇచ్చారు' అంటూ నదియాను ప్రశ్నించారు. ఊహించని పరిణామానికి కంగుతిన్న నదియా వెంటనే తేరుకుని... ఐఎస్ చేతుల్లో లైంగిక దాడులకు గురైన బానిసలకు విముక్తి కలిగించినందుకుగానూ ఆఫ్రికా గైనకాలజిస్ట్ డెనిస్ ముక్వేజ్తో సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి పొందినట్టు తెలిపారు. ట్రంప్ తీరు పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి.