Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధిత ఉద్యోగులకు రూ. 40.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి : యూఎస్ కార్మిక శాఖ
వాషింగ్టన్ : హెచ్-1బీ వీసా నిబంధనలను ఉల్లంఘించిన ఐటీ కంపెనీపై యూఎస్ కార్మికశాఖ కొరఢా ఝళిపించింది. హెచ్-1బీ వీసా పిటిషన్ దాఖలు కోసం చెల్లించాల్సిన ఫీజును ఉద్యోగుల నుంచి వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వదేశంలో ప్రతిభావంతుల కొరత ఏర్పడిందన్న విషయాన్ని అంగీకరించింది. యూఎస్లో ఉద్యోగం కోసం విదేశాల నుంచి వచ్చే ప్రతిభావంతుల నుంచి ఫీజులు వసూలు చేయడమేంటని ప్రశ్నించింది. ఈ ఫిర్యాదుపై సమగ్ర విచారణ చేపట్టింది. ఇద్దరు బాధిత ఐటీ ఉద్యోగులకు ఒక్కొక్కరికి 58,815 డాలర్ల (రూ.40,51,236) చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే... ప్రతిభావంతులకే హెచ్-1బీ వీసాలు అందజేస్తున్నట్టు ట్రంప్ సర్కార్ పేర్కొంది. విదేశాల నుంచి వచ్చే టెక్కీలకు యూఎస్ కంపెనీల్లో సముచిత ప్రాధాన్యం కల్పించాలని తెలిపింది.హెచ్-1బీ వీసాల జారీ నిబంధనల్లో పలు కీలక సంస్కరణలు చేపట్టింది. యూఎస్లో ఉద్యోగం కోసం వచ్చే ప్రతిభావంతుల నుంచి ఎలాంటి రుసుములు వసూలు చేయరాదని ఐటీ కంపెనీలకు గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హెచ్-1బీ వీసాల దరఖాస్తు కోసం అవసరమైన ఫీజును సదరు ఐటీ కంపెనీలే చెల్లించాలని పేర్కొంది. అయితే, కాలిఫోర్నియాకు చెందిన లాగిన్ కన్సల్టింగ్ సర్వీసెస్ ఐటీ కంపెనీ ట్రంప్ ఆదేశాలను ఉల్లంఘించింది. ఓ ఉద్యోగి చాలా నెమ్మదిగా పనిచేస్తున్నాడనే సాకుతో అతని హెచ్-1బీ వీసాకు అవసరమైన ఫీజు చెల్లించలేదని వివరణ ఇచ్చింది. కాగా, ప్రతిభావంతులకు మాత్రమే హెచ్-1బీ వీసా మంజూరు చేయాలి. నిధానంగా పనిచేస్తున్న ఉద్యోగికి కంపెనీలో ఉద్యోగం ఎలా ఇచ్చారని యూఎస్ లేబర్ డిపార్ట్మెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో ఉద్యోగిని అధిక పని గంటలు పనిచేయించుకొని తక్కువ వేతనం చెల్లించడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేసింది. హెచ్-1బీ వీసా నిబంధనలను ఉల్లంఘించే కంపెనీలపై భారీ జరిమానాలు విధిస్తామని వేతన, పని విభజన విభాగపు జిల్లా డైరెక్టర్ కిమ్చీ బియో హెచ్చరించారు. అత్యంత నైపుణ్యం ఉన్న ప్రతిభావంతులను మాత్రమే పని కల్పించాలని ఐటీ కంపెనీలను కోరారు.