Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిక్టర్స్కేల్పై తీవ్రత 5.1గా నమోదు
ఏథెన్స్ : గ్రీస్ రాజధాని ఏథెన్స్లో భూకంపం సంభవిం చింది.రిక్టర్స్కేల్పై తీవ్రత 5.1గా నమోదైందని యూఎస్ జియోలజికల్ సర్వే అధికారులు తెలిపారు. ఏథెన్స్ నగరం నుంచి 23కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైందని అన్నారు. భూప్రకంపనలు నమోదు కావడంతో ప్రజలు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. కాగా, ఓ పురాతన భవనం కూలిపోయినట్టు సమాచారం అందిందని ప్రభుత్వ అధికార స్టీలియో పెస్టాస్ తెలిపారు. భవనం కూలిన సమయంలో బిల్డింగ్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.