Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11 మంది మృతి
కాబూల్ : అఫ్ఘాన్లోని పోలీస్ హెడ్క్వార్టర్స్పై తాలిబన్లు పంజా విసిరారు. పోలీసులు నిద్రిస్తున్న సమయంలో మెరుపుదాడికి దిగారు. హెడ్క్వార్టర్స్లో నిలిపివున్న కారులో బాంబు అమర్చారు. కారు బాంబు పేలుడులో ఇద్దరు పోలీస్ అధికారులతో పాటు 11 మంది మృతి చెందారు. 90 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. కాందహార్ నగరంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు తామే బాధ్యత వహిస్తున్నట్టు తాలిబన్ సంస్థ అధికార ప్రతినిధి ఖారీ యూసుఫ్ అహ్మాదీ ప్రకటించుకున్నారు. తాలిబన్ల ఏరివేత కోసం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు కాందహార్ ప్రావిన్స్ గవర్నర్ హయాతుల్లా హయాత్ తెలిపారు. తాలిబన్లు తమ ఉనికిని చాటుకోవడానికే పోలీసులను, పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారని అన్నారు.