Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢాకా : బంగ్లాదేశ్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వరదల్లో చిక్కుకొని మృతి చెందినవారి సంఖ్య 30కి చేరుకుందని అధికారులు వెల్లడించారు. వందలాది మంది గల్లంతయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. వరద ప్రవాహంలో వందలాది ఇండ్లు కొట్టుకొనిపోయాయి. దీంతో, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 23 జిల్లాలు నీట మునిగాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ ఆస్తినష్టం జరిగినట్టు తెలిపారు. బోగ్రా జిల్లాలో భారీ వర్షపాతం నమోదైందని అన్నారు. వరదల నేపథ్యంలో విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. భారీ వర్షాలు కురిసే ప్రమాదమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.