Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్: చైనాలోని ఓ గ్యాస్ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో పది మంది మృతి చెందినట్టు చైనా మీడియా పేర్కొంది. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. హెనన్ ప్రావిన్స్లోని యిమా పట్ణణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.. ఈ పేలుడు ధాటికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండ్ల కిటికీలు, తలుపులు బద్దలైనాయని చైనా మీడియా వెల్లడించింది. ఈ పేలుడుకు గల కారణాలపై చైనా అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు.