Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లిస్బన్ : పోర్చుగల్లో కార్చిచ్చు చెలరేగింది. మంటల్లో చిక్కుకొని 9 మంది గాయపడ్డారు. వంద మందికి పైగా గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. రాజధాని లిస్బన్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో మంటలు దానానలంలా వ్యాపిస్తున్నాయి. వేలాది ఎకరాల పంట అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఘటనా స్థలానికి 760 అగ్నిమాపక వాహనాలు చేరుకున్నట్టు స్థానిక మీడియా ప్రక టించింది. గాలులు వేగంగా వీస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర అంత రాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. కార్చిచ్చు నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపారు. పలు ప్రాంతాల్లో హెలికాప్టర్ల సాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పోర్చుగల్ ఆర్మీ సహకరిస్తున్నది. 2017, అక్టోబర్లో పోర్చుగల్లో కార్చిచ్చు చెలరేగిన సంగతి తెలిసిందే. మంటల్లో చిక్కుకొని 114 మంది మృతి చెందారు.