Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికాలో భారతీయుడిపై దాడి జరిగింది. ఈ దాడిని విద్వేషపూర్వక దాడిగా పోలీస్ అధికారులు అనుమానిస్తున్నారు. న్యూయార్క్ పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...న్యూయార్క్ నగరంలోని గ్లెన్ ఓక్స్ ప్రాంతంలోని శివశక్తి పీఠం పూజారి హరీశ్ చందర్ పూరీ (52)పై ఓ దుండగుడు దాడికి పాల్పడ్డాడు. ఈనెల18న పీఠం సమీపంలో నడుచుకుంటూ వెళుతున్న హరీష్ చందర్పై వెనుకనుంచి వచ్చిన అతను విచక్షారహితంగా కొట్టాడు. దీంతో, ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో హరీశ్ చందర్ చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి సెర్జియా గువెయ(52) అనే అనుమానితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని పోలీస్ అధికారులు తెలిపారు. నిందితుడు దాడికి పాల్పడ్డ సమయంలో 'ఇది తమ ప్రాంతం' అంటూ నినాదాలు చేసినట్టు సమాచారం. దాడిలో తాను తీవ్రంగా గాయపడ్డానని.. ప్రస్తు తం గాయాల నుంచి కోలుకుంటున్నానని హరీశ్ చందర్ తెలిపారు. అయి తే ఇది విద్వేషపూరితంతో చేసిన నేరమా లేదా వ్యక్తిగత కక్షలతో జరిగిన దాడే అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు.