Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18 మంది మృతి
డమాస్కస్ : సిరియాలో తిరుగుబాటుదారుల జనాభా అధికంగా ఉన్న ఇద్లిబ్ ప్రావిన్స్లో వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో 18 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైమానిక దాడులను చిత్రీకరించేందుకు ప్రయత్నించిన అనాస్ అల్ ద్యాబ్ అనే జర్నలిస్ట్ కూడా మృతి చెందినట్టు స్టేట్ మీడియా ప్రకటించింది. పలువురు నేతలు, అధికారులు ద్యాబ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిరియాలో హక్కుల పర్యవేక్షణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం....ఇద్లిబ్లోని ఖాన్ షేఖున్ నగరానికి సమీపంలో వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో 18 మంది మృతిచెందారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు. సిరియా బలగాలే ఈ దాడికి పాల్పడినట్టు హక్కుల పర్యవేక్షణ సంస్థ ఆరోపించింది. కాగా, అధ్యక్షుడు అసద్ ఆదేశాల మేరకు తిరుగుబాటుదారుల శిబిరాలను లక్ష్యంగా చేసుకొని సిరియా సైన్యం వైమానిక దాడులకు పాల్పడుతున్నది. ఈదాడుల్లో అమాయక ప్రజలు కూడా మృతిచెందుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తిరుగుబాటుదారులు గతంలో స్కూల్స్ను, ఆస్పత్రులను, శివారు ప్రాంతాలను తమ శిబిరాలుగా ఉపయోగించుకునే వారు. తిరుగుబాటుదారులు తమ మకాంను మారుస్తుండటంతో వైమానిక దాడుల్లో సామాన్య ప్రజలు మృతి చెందుతున్నారు.