Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురి మృతి, ఒకరికి గాయాలు
పారిస్ : ఫ్రాన్స్లో కాల్పులు కలకలం సృష్టించాయి. దుండగుల కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పారిస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...పారిస్ నగరంలోని పెట్రోల్ బంక్లో దుండగులు బీభత్సం సృష్టించారు. పెట్రోల్ పోయించుకోవడానికి కారులో వచ్చిన పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు పాల్పడ్డారు. దుండుగుల కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు విదేశీ పర్యాటకులు ఉన్నారు. పరారీలో ఉన్న దుండుగుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయని అధికారులు తెలిపారు. మృతుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని అన్నారు. మృతుల కుటుంబాలకు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి క్రిస్టోఫ్ కాస్టనెర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.