Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు మృతి, 15 మందికి గాయాలు
వాషింగ్టన్ : అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలో కాల్పుల కలకలం రేగింది. గిల్రారులో జరుగుతున్న గార్లిక్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయ పడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. గిల్ రారు ఎస్పీ స్కాట్ స్మితీ తెలిపిన వివరాల ప్రకారం...30 ఏండ్ల వయ సున్న ఓ శ్వేతజాతీయుడు హఠాత్తుగా వేడుకల్లోకి ప్రవేశించి కాల్పులకు తె గబడ్డాడు. దుండగుడి కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాల్పులకు పాల్పడ్డ దుండగున్ని పోలీసులు మట్టుబెట్టారు. ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం....ఇద్దరు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. పరారీలో ఉన్న మరో దుండగుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ గార్లిక్ ఫెస్టివల్ని అమెరికాలోనే అతిపెద్ద ఫుడ్ ఫెస్టివల్గా చెబుతుంటారు. శాన్ జోస్లో ప్రతీఏటా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. 1979 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. లక్ష మందికి పైగా ఈ ఫెస్టివల్ను తిలకిస్తుంటారు. కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరో దుండగుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరి ంచారు. గన్ వాయిలెన్స్ ఆర్చీవ్స్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం...అమెరికాలో తుపాకుల విష సంస్కృతి నానాటికీ పెచ్చు మీరుతూనే ఉంది. ఈ ఏడాది యూఎస్లో 246 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. 8,434 మంది మృతి చెందారు.