Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో 72 ఏండ్ల కిందట మూతపడ్డ హిందూ దేవాలయం తెరుచుకుంది. పంజాబ్ ప్రావిన్స్లోని సియాల్ కోట్ నగరంలోని ఈ దేవాలయానికి 1000 ఏండ్ల చరిత్ర ఉన్నది. అయితే, భారత్లో బాబ్రీ మసీదు కూల్చివేతకు నిరసిస్తూ 1992లో కొంత మంది ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడంతో హిందువులు ఇక్కడికి రావడం మానేశారు. హిందూ భక్తుల విజ్ఞాపన మేరకు ఈ ఆలయాన్ని తెరిచినట్టు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. సర్దార్ తేజా సింగ్ నిర్మించిన షావాలా తేజా సింగ్ ఆలయం భారత్, పాక్ విభజన సమయంలో మూతపడింది. తాజాగా, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశాలతో ఆలయాన్ని తెరవాలని నిర్ణయించుకున్నట్టు స్థానిక మీడియా తెలిపింది. ప్రజలు స్వేచ్ఛగా ఎప్పుడైనా దర్శించుకోవచ్చునని డిప్యూటీ కమిషనర్ బిలాల్ హైదర్ తెలిపారు. ఈ ఆలయ పునరుద్ధరణ, పరిరక్షణ పనులను కూడా త్వరలో ప్రారంభించనున్నట్టు పాక్ ప్రభుత్వం ప్రకటించింది.