Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 మంది మృతి, 50 మందికి గాయాలు
- తృటిలో తప్పించుకున్న వైస్ప్రెసిడెంట్ అభ్యర్థి అమ్రుల్లా
కాబూల్ : అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ మరోసారి పేలుడుతో దద్దరిల్లింది. అఫ్ఘాన్లో సెప్టెంబర్28న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయనున్న అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులు ఆదివారం నుంచే తమ ప్రచారాన్ని ప్రారంభించారు.అయితే మిలిటెంట్లు ఉపాధ్యక్ష అభ్యర్థి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అమృల్లా సాలెV్ాను లక్ష్యంగా చేసుకొని సోమవారం విరుచుకుపడ్డారు. వైస్ప్రెసిడెంట్ అభ్యర్థి కార్యాలయం పై పేలుడు పదార్ధాలతో దాడి చేశారు. ఈ పేలుడులో 20 మంది మృతిచెందగా, మరో 50 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో అమృల్లా తృటిలో తప్పించుకున్నారు. పేలుడు శబ్ధంతో పరిసర ప్రాంతాలన్నీ దద్దరలిల్లాయి. స్థానికులు ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. అఫ్ఘాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి నస్రత్ రహీమీ వెల్లడించిన వివరాల ప్రకారం....గ్రీన్ ట్రెండీ పార్టీ ప్రధాన కార్యాలయంపై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 20 మంది మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు గ్రీన్ ట్రెండీ పార్టీ హెడ్క్వార్టర్స్ను చుట్టుముట్టాయి. అమృల్లా ను సురక్షితంగా బయటకు తీసుకెళ్లాయి. గ్రీన్ట్రెండీ పార్టీ కార్యాలయంలోనీ చొరబడి ఎదురుకాల్పులకు పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు అఫ్ఘాన్ బలగాలు ప్రయత్నిస్తున్నాయి. పార్టీ కార్యాలయంలో 85 మంది పౌరులను సైనికులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మిలిటెంట్లు పలువురు పౌరులను బందీలుగా మల్చుకున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. తాలిబన్లు లేదా ఐఎస్ సభ్యులే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.
అష్రఫ్ ఘనీకి ప్రాణహాని
అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీకి ప్రాణహాని ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అఫ్ఘాన్లో 18 ఏండ్ల నుంచి అంతర్యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాలిబన్లు, మిలిటెంట్లు అఫ్ఘాన్లో ఉనికి కోసం పోరాడుతున్నారు. భద్రతా బలగాలను, పోలీసులను, పౌరులను లక్ష్యంగా చేసుకొని పేలుళ్లకు పాల్పడుతున్నారు. అఫ్ఘాన్లోని అంతర్యుద్ధాన్ని తెరదించటమే తమ ముందున్న ఏకైక లక్ష్యమని అష్రఫ్ ఘనీ గతవారం వెల్లడించారు. అందుకే, మరోసారి ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు వెల్లడించారు. తాలిబన్ నేతలతో చర్చలు జరిపేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. అఫ్ఘాన్ నుంచి యూఎస్ బలగాలు పూర్తిగా వైదొలిగినట్టయితే చర్చల అంశంపై స్పందిస్తామని తాలిబన్ ప్రతినిధులు గతంలో తేల్చిచెప్పారు. అయితే, దీనిపై అఫ్ఘాన్ సర్కార్ స్పందన కొరవడింది. తాలిబన్లతో చర్చలను ఓ కొలిక్కి తీసుకురావాలని అష్రఫ్ ఘనీ యోచిస్తున్నారు. గతంలో జరిగిన చర్చల్లో ప్రభుత్వ ప్రతినిధులెవరూ హాజరు కాకపోవడంతో సఫలం కాలేదు. అఫ్ఘాన్ సర్కార్ ఓ పక్క చర్చలకు రంగం సిద్ధం చేస్తుండగా మరోపక్క తాలిబన్, ఐఎస్ సభ్యులు అఫ్ఘాన్లో దాడులకు పాల్పడుతూ చర్చలకు విఘాతం కల్గిస్తున్నారు.