Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18 మంది మృతి
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో ఓ సైనిక శిక్షణ విమానం కుప్పకూలింది. రావల్పిండి సమీపంలోని గ్యారిసన్ నగరంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పైలట్లు సహా 18 మంది మృతి చెంచారు. మృతుల్లో ఐదుగురు సైనికులు, 13 మంది పౌరులు ఉన్నారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. గాయపడ్డవారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విమానం శిక్షణలో భాగంగా చక్కర్లు కొడుతున్న సమయంలో ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయిన రావల్పిండి నగర శివారులోని నివాససముదాయాల్లో కుప్పకూలిందన్నారు. ప్రమాదానికి ముందు కంట్రోల్ విభాగంతో సంబంధాలు తెగిపోయాయని.. అసలు కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు. ఘటనాస్థలిలో ఇంకా మంటలు చెలరేగుతుండడంతో సిబ్బంది సహాయక చర్యల్లో నిమగమయ్యారు.