Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టిన ఇథియోపియా
అడీస్ అబాబ : పర్యవరణ పరిరక్షణపై ఇథియోపియా సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. అంతరించిపోతున్న వృక్ష సంపదను కాపాడుకోవాలని భావించింది. దీనిలో భాగంగా మంగళవారం ఏకంగా 35 కోట్ల మొక్కలను నాటి రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని ఇథియోపియా మంత్రి గెటాహన్ మెకూరియా వెల్లడించారు. 4బిలియన్ మొక్కలను నాటాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నామని ప్రధాని అబీ అహ్మద్ తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులను, విద్యార్థులను, అధికారులను, పార్టీ నేతలను, పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులను అహ్మద్ ఈ సందర్భంగా అభినందించారు.