Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురి మృతి, 38 మందికి గాయాలు
ఇస్లామాబాద్ : బలూచిస్థాన్లోని క్వెట్టా నగరంలో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పోలీస్ అధికారులు ఉన్నారు. మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. క్వెట్టా డీఐజీ అబ్దుల్ రజాక్ తెలిపిన వివరాల ప్రకారం...బచ్చాఖాన్ చౌక్ ప్రాంతంలో పేలుడు సంభవించింది. పోలీసు వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. సీఐని లక్ష్యంగా చేసుకొని దుండగులు ఈ దాడికి పాల్పడినట్టు డీఐజీ అనుమానం వ్యక్తం చేసింది. ఈ దాడిలో గాయపడ్డ సీఐని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ పేలుడు వెనుక ఉగ్రకోణం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో క్వెట్టాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు తెహ్రీక్ ఇ తాలిబన్ ఉగ్రసంస్థ ప్రకటించుకుంది.మృతుల కుటుంబాలకు బలూచిస్థాన్ హౌంమంత్రి మిర్ జియా లాంగోవ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇది పిరికిపందల చర్య అని అన్నారు. ఇలాంటి దాడులకు తమ ప్రభుత్వం భయపడదన్నారు. మిలిటెంట్ల ఏరివేత కోసం ప్రత్యేక ఆపరేషన్ కొనసాగిస్తామని అన్నారు.