Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా నిఘావర్గాల వెల్లడి
వాషింగ్టన్ : అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కొడుకు హమ్జా బిన్ లాడెన్ను అంతమొందించినట్టు అమెరికా నిఘా వర్గాలు ప్రకటించాయి. ఈ సమాచారాన్ని ఓ ప్రముఖ న్యూస్ ఏజ్సెనీ ద్వారా తెలియజేశాయి. కానీ ఎక్కడీ ఎప్పుడు? చంపారనే విషయాన్ని మాత్రం తెలపలేదు. అలాగే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా దీని మీద మాట్లాడానికి నిరాకరించారు. బిన్ లాడెన్ మరణాంతరం అల్ ఖైదా చీఫ్గా హమ్జా బిన్ లాడెన్ వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంతోనే అతన్ని అమెరికా ప్రభుత్వం 2018లో ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. అలాగే అతని జాడ తెలిపినవారికి 10 లక్షల బహుమతిని ప్రకటించింది. హమ్జా బిన్ లాడెన్ తన చివరి బహిరంగ ప్రకటనలో సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని బెదిరిస్తూ.. అక్కడి ప్రజలకు తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చాడు.ఈ క్రమంలోనే ఒసామా బిన్ లాడెన్ తరహాలోనే చంపినట్టు సమాచారం.అల్ఖైదా నాయకుడిగా ఒసామా బిన్ లాడెన్ 2001సెప్టెంబర్ 11న, న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగాన్పై దాడికి పాల్పడ్డాడు. ఈ కారణంతో ఒసామా బిన్ లాడెన్ను 2011లో పాకిస్థాన్లోని అబోటాబాద్లో అమెరికా ఆర్మీ హతమార్చింది. ఈ దాడిలో బిన్ లాడెన్ పెద్ద కుమారుడు, మరో ఇద్దరు అల్ఖైదా నాయకులను చంపిన విషయం తెలిసిందే.