Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : ఇరాన్ను ఆర్థికంగానే గాక, పరిపాలన పరంగానూ అస్థిరపరిచేలా అమెరికా వ్యవహరిస్తున్నది. ఈ క్రమంలోనే ఇరాన్ విదేశాంగ మంత్రి జావాద్ జరీఫ్పై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇతర దేశాలకు ప్రయాణిం చకుండా ఆయనపై ఆంక్షలను విధించింది. అలాగే అమెరికాలోని ఆయన ఆస్తులను జప్తు చేస్తున్నట్టు తెలిపింది. ఈ ఆంక్షలపై జావాద్ జరీఫ్ స్పందిస్తూ '' ఇలాంటి చర్యలు నిజంగా బాధాకరం. ఇరాన్ వెలుపల నాకు ఆస్తులు లేనందున ఈ ఆంక్షలు ఎలాంటి ప్రభావం చూపవు. ఇరాన్తో అమెరికాకు ముప్పుందని నాపై ఆంక్షల విధించినందుకు ధన్యవాదాలు '' అని ట్వీట్ చేశారు.
ఇరాన్ అణు కార్యకలాపాలను అరికట్టే లక్ష్యంతో అమెరికా గతేడాది ''అణు ఒప్పందం-2015'' నుంచి వైదొలిగింది. అప్పట్నుంచీ ఇరుదేశాల మధ్య ఉద్రిక్త తలు తీవ్రమవుతున్నాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేలా అమెరికా కఠినమైన ఆంక్షలు విధిస్తున్నది. ఈ నేపథ్యంలోనే అమెరికా సైనికులు ఇరాన్ చమురు నౌకపై దాడి చేయడం తెలిసిందే. ఈ వివాదం మరవకముందే అమెరికా మరోసారి ఇరాన్ విదేశాంగ మంత్రిపై ఆంక్షలు విధించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది. కాగా ఈ విషయంపై పలు దేశాల అధికారులు విమర్శలు వ్యక్తం చేశారు. ''జావాద్ జరీఫ్ ఇరాన్ అధికార ప్రతినిధే కాదు. ఆ దేశ సార్వభౌమత్వానికి ప్రతీక, అతనిపై ఆంక్షలు విధించడం ఆమోదయోగ్యం కాదు'' అని ట్రెజరీ కార్యదర్శి స్టీవెన్ మునుచిన్ అన్నారు. ''గతంలో ఇరాన్ అధికారిక ప్రతినిధి అయతోల్లా అలీ ఖమేనీపై కూడా అమెరికా ఇలాంటి ఆంక్షలే విధించింది.
ఆలోచనా శక్తిని కోల్పోయిన అమెరికా : రొహానీ
తమ విదేశాంగ మంత్రిపై అమెరికా ఆంక్షలు విధించటం పిల్ల చేష్ట వంటిదని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రొహానీ విమర్శించారు. అమెరికా ఆలోచనా శక్తిని కోల్పోయిందన్న విషయాన్ని ఈ అంశం రుజువు చేస్తోందని ఆయన ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. గతంలో ఇరాన్తో బేషరతు చర్చలను ప్రతిపాదించిన అమెరికా ఇంతలోనే యుటర్న్ తీసుకుని తమ విదేశాంగ మంత్రి జావాద్ జరీఫ్పై ఆంక్షలు విధించటం పిల్ల చేష్టలను తలపిస్తోందని అన్నారు. 'ఇరాన్తో బేషరతు చర్చలకు సిద్ధమని ప్రతిరోజూ చెబుతూనే ఉంటారు, మరోవైపు విదేశాంగ మంత్రిపై ఆంక్షలు విధిస్తారు' అంటూ ఆయన అమెరికాపై నిప్పులు చెరిగారు. వారు హేతుబద్ధమైన ఆలోచనా శక్తిని కోల్పోయారన్న విషయాన్ని ఇది రుజువు చేస్తోందన్నారు. తమ విదేశాంగ మంత్రి మీడియా ఇంటర్వ్యూల్లో వెల్లడిస్తున్న అంశాలకు భయపడి అమెరికా ఆయనను టార్గెట్ చేస్తోందని విమర్శించారు.
జపాన్ పార్లమెంటు ఎగువ సభలో గురువారం
ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వీల్చైర్కు పరిమితమైన ఇద్దరు కొత్త చట్టసభ్యులు యసుహికో ఫునాగో(కుడి), ఎయికో కిమూరాలు సిబ్బంది సహాయంతో ఈ సభకు హాజరయ్యారు. వీరికి అనుకూలంగా ఉండేలా సభలో కుర్చీలను మరమ్మతు చేయించారు. నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి(ఏఎల్ఎసహ)తో బాధపడుతున్న ఫునాగో, పాక్షిక పక్షవాతం బారినపడ్డ కిమూరాలు.. ఎన్నికలు ముగిసిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న సమావేశంలో ఇలా కొలువుదీరారు.