Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇజ్రాయిల్ జైలు అధికారుల నుంచి
కాపాడాలని విన్నపం
జెరుసలెం: ఇజ్రాయిల్ జైలు అధికారుల వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ నెగెవ్ జైల్లో పాలస్తీనా ఖైదీలు చేస్తున్న నిరాహార దీక్ష కొనసాగుతున్నది. రెండు నెలల క్రితం ఎనిమిది మంది ఖైదీలతో ప్రారంభమైన ఈ దీక్షలో మరో 12 మంది ఖైదీలు చేరారు. ప్రస్తుతం 20మంది పాలస్తీనా ఖైదీలు నిరాహార దీక్ష చేస్తున్నట్టు 'పాపులర్ ఫ్రంట్ ఫర్ లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా' (పీఎఫ్ఎల్పీ) జైళ్ల శాఖ తెలిపింది. తమ ఆరోగ్యం, ప్రాణాలకు ఇజ్రాయిల్ జైళ్ల శాఖనే బాధ్యత వహించాలని సమ్మె చేస్తున్న ఖైదీలు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా దీన్ని జైళ్ల శాఖ ఖండించింది. తమ అధికారులు సమస్య పరిష్కారానికి సమ్మె చేస్తున్న ఖైదీలను సంప్రదించామని తెలిపింది. అయినప్పటికీ వారు సమ్మె విరమించుకోలేదని వెల్లడించింది. దీన్ని ఖైదీలు కొట్టిపారేశారు. పీఎఫ్ఎల్పీ అనుబంధ ఖైదీలను జైలు అధికారులు నిత్యం హింసిస్తున్నారని ఆరోపించారు. సమ్మెను కొనసాగిస్తే ఇతర జైళ్లకు బదిలీ చేస్తామని బెదిరిస్తున్నట్టు తెలిపారు. ఇజ్రాయిల్ అధికారులు పాలస్తీషియన్లను అక్రమంగా బంధిస్తున్నారని వాపోయారు.